ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: అనుమానంతో భార్య, అత్తను హత్య చేసిన భర్త..

ABN, First Publish Date - 2021-09-17T18:04:32+05:30

భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను, ఆమె తల్లి(అత్త)ని కత్తితో పొడిచి చంపాడు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో గురువారం ఈ ఘోరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/తిరుమలగిరి: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను, ఆమె తల్లి(అత్త)ని కత్తితో పొడిచి చంపాడు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో గురువారం ఈ ఘోరం జరిగింది. తిరుమలగిరి సీఐ శ్రావణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చిన్నబాబు-నాగపుష్ప దంపతులు. వీరికి పదేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి మిలిటరీ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. నాగపుష్ప సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని మిలిటరీ ఆస్పత్రిలో సహాయ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో చిన్నబాబు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా నాగపుష్ప ప్రవర్తనను చిన్నబాబు అనుమానిస్తున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన చిన్నబాబు.. నాగపుష్పను, ఆమె తల్లి కుమారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్యపై అనుమానంతోనే అతడు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నాగపుష్ప తండ్రి వీరభద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-09-17T18:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising