‘ఆంధ్రజ్యోతి’ వార్తకు వివరణ
ABN, First Publish Date - 2021-05-12T15:40:13+05:30
ఆంధ్రజ్యోతిలో మంగళవారం ‘హోమియోపతి ఆస్పత్రిలో సిబ్బంది కొరత’ శీర్షికన ప్రచురితమైన వార్తకు ఆస్పత్రి ఛీఫ్...
హైదరాబాద్/రామంతాపూర్: ఆంధ్రజ్యోతిలో మంగళవారం ‘హోమియోపతి ఆస్పత్రిలో సిబ్బంది కొరత’ శీర్షికన ప్రచురితమైన వార్తకు ఆస్పత్రి ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ వేణు సుకుమార్ వివరణ ఇచ్చారు. హోమియో ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారుల ఆదేశాలు, వ్యాక్సిన్ లభ్యత మేరకు రోజుకు 200 మందికి రెండో డోసు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సరపడా ఉన్నారనీ.. కొవిషీల్డ్ రెండవ డోసు వాక్సిన్కు 6 వారాల తర్వాతే రావాలన్నారు. ఈ నిబంధనలు తెలియకపోవడంతో రోజుకు 400 మంది రావడటంతో రద్దీ నెలకొంటోందని ఆయన వివరించారు. ఆస్పత్రిలో వంద మందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు.
Updated Date - 2021-05-12T15:40:13+05:30 IST