తస్మాత్ జాగ్రత్త.. Hyderabad లోని ఈ ఏరియాలో భారీ గుంత.. మేల్కోకుంటే ముప్పే!
ABN, First Publish Date - 2021-09-06T17:40:03+05:30
రోడ్డు క్రాస్ చేసే సమయంలో పొరపొటున అందులో పడితే...
హైదరాబాద్ సిటీ/హయత్నగర్ : జీహెచ్ఎంసీ హయత్నగర్ డివిజన్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను హరించేలా ఉంది. పద్మావతి కాలనీలో రోడ్డు పక్కనే ట్రంకు లైను కుంగి నెల రోజుల క్రితం ఓ గుంత ఏర్పడింది. దాన్ని పూడ్చకపోవడంతో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అది పెద్ద గోతిలా మారిపోయింది. రోడ్డు క్రాస్ చేసే సమయంలో పొరపొటున అందులో పడితే అంతే సంగతి అని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-09-06T17:40:03+05:30 IST