ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై కళ్లు

ABN, First Publish Date - 2021-06-18T15:51:27+05:30

జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహ కల్పలో అదనపు గదుల నిర్మాణాల ముసుగులో ప్రభుత్వ స్థలాల కబ్జా కొనసాగుతోంది. ఆక్రమణలను అడ్డుకోవడంలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, హౌజింగ్‌ బోర్డు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగద్గిరిగుట్ట రాజీవ్‌ గృహకల్పలో ప్రభుత్వ స్థలంలో గదులు  

రెండు బ్లాక్‌ల ప్రజలు బాహాబాహీ


హైదరాబాద్/జీడిమెట్ల: జగద్గిరిగుట్ట రాజీవ్‌గృహ కల్పలో అదనపు గదుల నిర్మాణాల ముసుగులో ప్రభుత్వ స్థలాల కబ్జా కొనసాగుతోంది. ఆక్రమణలను అడ్డుకోవడంలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, హౌజింగ్‌ బోర్డు అధికారులు విఫలం కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. సంక్షేమ సంఘాల ముసుగులో, కొందరు స్థానిక ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ కబ్జాతంతంగం జరుగుతోంది. తాజాగా బ్లాక్‌ నెంబర్‌ 43 వద్ద ఏకంగా సీసీ రోడ్డును తవ్వి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పక్క బ్లాక్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముడుపులు ముట్టడంతో ఇక్కడ కబ్జాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

సంజయ్‌గాంధీనగర్‌లో కేవలం 40 గజాల్లో చేపట్టిన నిర్మాణాన్ని అనుమతులు లేవని కూల్చివేసిన గాజుల రామారం కమిషనర్‌కు జగద్గిరిగుట్టలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు కనపించడం లేదా స్థానికులు అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాజీవ్‌ గృహ కల్పలో అదనపు గదుల ముసుగులో సాగుతున్న కబ్జాలను అరికట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-18T15:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising