ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విన్యాసాలు అదుర్స్‌..!

ABN, First Publish Date - 2021-11-07T15:52:38+05:30

సదర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి ప్రారంభమైన వేడుకలు ఉదయం నాలుగు గంటల వరకు కొనసాగాయి. అందంగా ముస్తాబైన దున్నలను విద్యుత్‌దీపాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: సదర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి ప్రారంభమైన వేడుకలు  ఉదయం నాలుగు గంటల వరకు కొనసాగాయి. అందంగా ముస్తాబైన దున్నలను విద్యుత్‌దీపాలు, పూలదండలతో అలంకరించిన శకటాలపై రాచఠీవీని ఒలకబోస్తూ బ్యాండ్‌ మేళాల ఊరేగింపుతో నారాయణగూడ వైఎంసీఏ ప్రధాన వేదికకు తీసుకువచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం సలేంద్రి చౌదరి మల్లయ్య యాదవ్‌ కుటుంబసభ్యులు దున్నలకు అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. 


ఈ సందర్భంగా కొందరు దున్నలతో చేయించిన విన్యాసాలు అదుర్స్‌ అనిపించాయి.  టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు వేడుకలలో పాల్గొన్నారు. ఆయా పార్టీల నేతలు ప్రత్యేక వేదికలు ఏర్పాటుచేసి ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. సెంట్రల్‌జోన్‌ జాయింట్‌ సీపీ, ఈస్ట్‌జోన్‌ డీసీపీలు భద్రతను పర్యవేక్షించారు. ఆబిడ్స్‌ ఏసీపీ, సెంట్రల్‌జోన్‌ పరిధిలోని సీఐలు బందోబస్తులో పాల్గొన్నారు.  


దున్నకు 3కిలోల బంగారు గొలుసు 

చప్పల్‌ బజార్‌లో సదర్‌ ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఓ దున్నకు లడ్డూయాదవ్‌ మూడు కిలోల బంగారు గొలుసు చేయించి అలంకరించారు. హరియాణా నుంచి ఈ దున్నను తీసుకురాగా, దాని యజమాని డబ్బులు తీసుకోలేదు. దీంతో బంగారు గొలుసు చేయించారు.

Updated Date - 2021-11-07T15:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising