కరోనాతో కుమార్తె మృతి.. కుప్పకూలిన కార్పొరేటర్
ABN, First Publish Date - 2021-05-10T18:27:05+05:30
కూతురు మృతితో కార్పొరేటర్ కుప్పకూలిపోయారు.
హైదరాబాద్/మెహిదీపట్నం : గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు ఆవుల భవానీ శనివారం రాత్రి కరోనాతో మృతి చెందారు. ఆమెకు కొన్నిరోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ రాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. పదిరోజుల క్రితం ఆమె బాబుకు జన్మనిచ్చింది. కూతురు మృతితో కరుణాకర్ కుప్పకూలిపోయారు. భవానీ మృతికి హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Updated Date - 2021-05-10T18:27:05+05:30 IST