హైదరాబాద్లో దొంగల బీభత్సం
ABN, First Publish Date - 2021-07-26T14:58:21+05:30
నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు.
హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో అంబెడ్కర్ నగర్లోని ఓ ఇంటి కిటికీలు పగలగొట్టి లోనికి చొరబడ్డ దుండగులు రూ.80వేలు నగదు అపహరించారు. అలాగే శ్రీరామ్ నగర్లోని వినాయకుడి గుడిలో ఆంజనేయిడి విగ్రహం, దుర్గామాత వెండి విగ్రహలను చోరీ చేశారు. చోరీ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రెండు విగ్రహాలు సుమారు 1కేజీ వెండి వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. గంట వ్యవధిలో రెండు చోరీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటివీలో ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు విజువల్స్ రికార్డు అయ్యాయి.
Updated Date - 2021-07-26T14:58:21+05:30 IST