హైదరాబాద్: జ్యోతిష్యుని ఇంట్లో భారీ చోరీ
ABN, First Publish Date - 2021-06-18T14:09:47+05:30
నగరంలోని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు
హైదరాబాద్: నగరంలోని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడా న్యూ వెంకటరమణ కాలనీలోని బాల మురళీ కృష్ణ అనే జోతిష్యుని ఇంట్లో చొరబడ్డ దుండగులు రూ.40 లక్షలు విలువజేసే జాతకం(రంగు) రాళ్లు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్ టీమ్లతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2021-06-18T14:09:47+05:30 IST