ఆగంతకుల దాడిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
ABN, First Publish Date - 2021-05-03T18:11:04+05:30
నగరంలోని మెహదీపట్నం ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద దారుణం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నం ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం వద్ద దారుణం చోటు చేసుకుంది. డబ్బు డ్రా చేసుకోవడానికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమేష్ కుమార్పై ముగ్గురు ఆగంతకులు దాడి చేశారు. అతని వద్ద నుంచి డబ్బులు, పర్సు, రెండు బంగారు ఉంగరాలు, సెల్ఫోన్ను లాక్కొని పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా...పెళ్లి అయిన 8 నెలలకే భర్తను కోల్పోవడంతో అయోధ్య నగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-05-03T18:11:04+05:30 IST