రాచకొండ పోలీసుల అదుపులో మరో సైకో కిల్లర్
ABN, First Publish Date - 2021-01-26T14:19:40+05:30
ఒంటరి మహిళలే టార్గెట్గా హత్యలకు పాల్పడుతున్న మరో సైకో కిల్లర్ను రాచకొండ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: ఒంటరి మహిళలే టార్గెట్గా హత్యలకు పాల్పడుతున్న మరో సైకో కిల్లర్ను రాచకొండ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్కు చెందిన వెంకటమ్మ అనే మహిళను సైకో కిరాతకంగా హత్య చేశాడు. వెంకటమ్మ మొహంపై పెట్రోల్ పోసి హత్య చేశాడు. గత 20 రోజుల పాటు కేసు దర్యాప్తు చేసి కీలక క్లూస్ రాబట్టిన రాచకొండ పోలీసులు...బోరబండకు చెందిన వ్యక్తి హత్య చేసినట్టు గుర్తించారు. ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి సైకో హత్య చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితున్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 16 మంది మహిళలను హత్య చేసినట్టు సైకో ఒప్పుకున్నాడు. కళ్ళు దుకాణాలు, మద్యం షాప్ వద్ద ఒంటరిగా ఉన్న మహిళలను సైకో టార్గెట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Updated Date - 2021-01-26T14:19:40+05:30 IST