HYD: చింతల్బస్తీలో గవర్నర్ తమిళిసై పర్యటన
ABN, First Publish Date - 2021-12-29T17:27:54+05:30
నగరంలోని చింతల్బస్తీలో గవర్నర్ తమిళిసై బుధవారం ఉదయం పర్యటించారు.
హైదరాబాద్: నగరంలోని చింతల్బస్తీలో గవర్నర్ తమిళిసై బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ను తమిళిసై సందర్శించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వందశాతం తొలిడోసు పూర్తి కావడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి కేంద్రం అవసరమైన డోసులు పంపిణీ చేసిందని తెలిపారు. 2022 ఆరోగ్య సంవత్సరంగా సాగాలని కోరుకుంటున్నానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
Updated Date - 2021-12-29T17:27:54+05:30 IST