గచ్చిబౌలిలో దారుణం.. బిల్డింగ్ అద్దె కట్టలేక వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-30T16:57:05+05:30
నగరంలో దారుణం జరిగింది. బిల్డింగ్ రెంట్ కట్టలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన గచ్చిబౌలిలోని వినాయక్నగర్లో చోటుచేసుకుంది.
హైదరాబాద్: నగరంలో దారుణం జరిగింది. బిల్డింగ్ అద్దె కట్టలేక హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గచ్చిబౌలిలోని వినాయక్నగర్లో చోటుచేసుకుంది. బిల్డింగ్ ఓనర్ అద్దె కావాలని ఆ వ్యక్తిని ఒత్తిడి చేశాడు. అలాగే మనుషులను హాస్టల్ నిర్వాహకుడు ఉంటున్న బిల్డింగ్ వద్దకి పంపించి గొడవ చేయించి తీవ్ర ఒత్తిడికి గురి చేశాడు. దీంతో యజయాని ఒత్తిడి భరించలేక తెల్లవారుజామున అతను ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వాట్సాప్లో మన హాస్టల్ అసోసియేషన్ ముఖ్యమైన సభ్యులందరూ వెంటనే ఘటనా స్థలానికి రావాలని సందేశం పంపించాడు.
Updated Date - 2021-10-30T16:57:05+05:30 IST