ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లఖీంపూర్‌ ఘటనకు నిరసనగా Hanumantrao నిరాహారదీక్ష

ABN, First Publish Date - 2021-10-14T15:51:08+05:30

యూపీ లఖీంపూర్‌లో రైతుల హత్యకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. లఖీంపూర్‌ ఘటనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాంనగర్‌: యూపీ లఖీంపూర్‌లో రైతుల హత్యకు బాధ్యులైన కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. లఖీంపూర్‌ ఘటనకు నిరసనగా బాగ్‌అంబర్‌పేటలోని తన నివాసంలో బుధవారం ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.కోదంరెడ్డి, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు వీహెచ్‌ నిరాహారదీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. అజయ్‌కుమార్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నారు. లఖీంపూర్‌ ఘటనపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీక్షలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌, ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌లాల్‌, బొల్లు కిషన్‌, నాగేష్‌ ముదిరాజ్‌, అజ్మతుల్లా హుస్సేన్‌, కార్యదర్శి ఆర్‌.లక్ష్మణ్‌యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు మోతె రోహిత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T15:51:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising