లాక్ డౌన్లో పోలీసుల సేవలు మరువలేనివి: మైనంపల్లి రోహిత్
ABN, First Publish Date - 2021-05-23T01:27:24+05:30
Mainampalli Rohit
హైదరాబాద్: కరోనా సమయంలో నిరుపేదలకు, ప్రాణాలకు తెగించి ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్ తెలిపారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 800 పోలీసు సిబ్బందికి హై ప్రోటీన్ డైట్తో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఈసందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో పోలీసుల సేవలు మరువలేనివని చెప్పారు. పోలీసులకు సహకరించాలని అనవసరంగా రోడ్లపైకి రావద్దని సూచించారు. లాక్ డౌన్ మొదలు నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా తమ సంస్థ సేవలు కొనసాగిస్తున్నట్లు రోహిత్ తెలిపారు. సామాజిక సేవలను మరింత విస్తృతం చేస్తామని.. పేదలకు అండగా నిలుస్తామని మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు.
Updated Date - 2021-05-23T01:27:24+05:30 IST