‘భౌ’బోయ్.. నెల రోజుల వ్యవధిలో నలుగురిపై దాడి
ABN, First Publish Date - 2021-02-28T17:18:40+05:30
చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వీధి కుక్కలు ప్రజలపై...
హైదరాబాద్/కుషాయిగూడ : చర్లపల్లి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వీధి కుక్కలు ప్రజలపై దాడిచేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. చిన్నారులు మొదలుకొని ఉద్యోగులు, ఇతరులు ఇలా వీధుల్లోకి వచ్చే వారిపై దాడికి పాల్పడుతున్నాయి. గత నెలలో కుషాయిగూడ శివసాయి నగర్కు చెందిన ఐదేళ్ల చిన్నారి మోక్షపై శునకం దాడి ఘటన మరువకముందే 22న చర్లపల్లి భరత్నగర్లో బిహారీ వలస కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక నుంజున్ను వీధి శునకాలు గాయపరిచాయి. ఇటీవల సోనియాగాంధీ నగర్లో ఏడో తరగతి చదువుతున్న వైష్ణవి (11) శునకాల బారిన పడింది. శివసాయినగర్ ఫేజ్-2లో నివసించే వెంకన్న విధులు ముగించుకొని వస్తుండగా, వెనక నుంచి వచ్చిన వీధి కుక్కలు అతడిపై దాడికి పాల్పడ్డాయి. వరుస ఘటనలతో చర్లపల్లి వాసులు భయాందోళనకు గురవుతు న్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - 2021-02-28T17:18:40+05:30 IST