వ్యక్తి బ్యాంక్ ఖాతానుంచి నగదు మాయం
ABN, First Publish Date - 2021-08-02T06:44:37+05:30
తనకు తెలియకుండా బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయమైందంటూ ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పంజాగుట్ట, ఆగస్ట్ 1 (ఆంధ్రజ్యోతి): తనకు తెలియకుండా బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయమైందంటూ ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మారేడ్పల్లికి చెందిన కేజీ నాయుడు రాజ్భవన్ రోడ్డులో ఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. అతడికి ఎస్బీఐ సికింద్రాబాద్ శాఖలో ఖాతా ఉంది. గతనెల 30న ఖాతా నుంచి రూ. 48,700 డెబిట్ అయినట్లు ఫోన్కు సందేశం వచ్చింది. దీంతో ఆన్లైన్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు మార్చాడు. నగదు మాయమైన విషయమై టోల్ ఫ్రీ నంబర్కు, పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-08-02T06:44:37+05:30 IST