Hyderabad: చలో రాజ్భవన్కు సీపీఐ పిలుపు
ABN, First Publish Date - 2021-11-23T16:59:44+05:30
కల్లాలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్భవన్కు సీపీఐ పిలుపునిచ్చింది.
హైదరాబాద్: కల్లాలో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్భవన్కు సీపీఐ పిలుపునిచ్చింది. కాసేపట్లో సీపీఐ ఆధ్వర్యంలో హిమాయత్నగర్ ఏఐటీయూసీ కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. కాగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ పార్టీ నేతలు నారాయణ, చాడ, కూనంనేనిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Updated Date - 2021-11-23T16:59:44+05:30 IST