కేసీఆర్ సర్కార్ కూడా ఫోన్లను ట్యాప్ చేస్తోంది: Jagga reddy
ABN, First Publish Date - 2021-07-22T17:22:30+05:30
మోదీ ప్రభుత్వం అప్రజస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: మోదీ ప్రభుత్వం అప్రజస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్కు నిరసనగా చలో రాజ్భవన్కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఇందిరాపార్క్ వద్దకు చేరుకున్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోనియా, రాహుల్ ఫోన్లను ట్యాప్ చేస్తూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయన్నారు. నిరసన తెలపకుండా అడ్డుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓపిక నశిస్తే చెప్పకుండానే రాజ్భవన్ ముట్టడిస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు.
Updated Date - 2021-07-22T17:22:30+05:30 IST