గవర్నర్ మాతృమూర్తి మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం
ABN, First Publish Date - 2021-08-18T14:29:43+05:30
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమార్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి కృష్ణకుమార్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణకుమారి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణకుమారి మృతితో గవర్నర్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పార్థివదేహాన్ని రాజ్భవన్లో ఉంచనున్నారు. అనంతరం ఆంత్యక్రియల కోసం చెన్నైకి తరలించనున్నారు. కృష్ణకుమారి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
Updated Date - 2021-08-18T14:29:43+05:30 IST