యూట్యూబ్ చానెల్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు పెట్టండి : సీపీ ఆదేశం
ABN, First Publish Date - 2021-04-22T06:21:34+05:30
రాత్రి కర్ఫ్యూ సందర్భంగా పోలీసులు లాఠీలు ఝళిపించారంటూ ఓ ప్రైవేట్ యూ ట్యూబ్ చానెల్లో వార్తను ప్రసారం చేశారు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాత్రి కర్ఫ్యూ సందర్భంగా పోలీసులు లాఠీలు ఝళిపించారంటూ ఓ ప్రైవేట్ యూ ట్యూబ్ చానెల్లో వార్తను ప్రసారం చేశారు. అయితే తాము ఎక్కడా లాఠీలు ఝళిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. పాత వీడియో తీసి చానెల్లో ప్రసారం చేశారని, అసత్య వార్త ప్రసారం చేసిన సదరు చానెల్ నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, జర్నలిస్టును అరెస్టు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2021-04-22T06:21:34+05:30 IST