నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం మూసివేత
ABN, First Publish Date - 2021-05-05T12:59:23+05:30
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో భక్తులు, అర్చక సిబ్బంది సంక్షేమం దృష్ట్యా దేవాదాయశాఖ ఆదేశాల మేరకు...
హైదరాబాద్/అమీర్పేట: కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో భక్తులు, అర్చక సిబ్బంది సంక్షేమం దృష్ట్యా దేవాదాయశాఖ ఆదేశాల మేరకు బుధవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ, ఫౌండర్ట్రస్టీ సాయిబాబా గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమ్మవారి ఏకాంత సేవలు ఆలయ ప్రాంగణంలో అర్చకులు మాత్రమే నిర్వహిస్తారని అన్నారు. ఆలయం పక్కన గల బోనం కాంప్లెక్స్ను కూడా మూసివేస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2021-05-05T12:59:23+05:30 IST