కేసీఆర్పై పోటీకి సిద్ధం: Etela
ABN, First Publish Date - 2021-12-16T19:46:58+05:30
బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్పై పోటీకి సిద్ధమని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్పై పోటీకి సిద్ధమని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇక టీఆర్ఎస్తో కొట్లాటే.. తెలంగాణలో అధికారం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఆత్మగౌరవానికి ఖరీదు కట్టిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. మెజార్టీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్లో ఉన్నారని తెలిపారు. ఇక టీఆర్ఎస్కు భవిష్యత్ లేదని అక్కడి నేతలే అంటున్నారు. థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి.. ముందు రాష్ట్రాన్ని కేసీఆర్ చక్కదిద్దాలని ఎమ్మెల్యే హితవు పలికారు. తాను కాంగ్రెస్లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో గ్రూపులు లేవని... బండి సంజయ్తో వైరం లేదని తేల్చిచెప్పారు. ఏడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ఎస్సీలపై ప్రేమ ఉంటే ఇప్పుడు దళితబంధు అమలు చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-12-16T19:46:58+05:30 IST