ప్రజలు మోదీకి అండగా ఉండాలి: Bandi sanjay
ABN, First Publish Date - 2021-08-15T16:09:25+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని రాష్ట్ర బీజేపీ
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంకోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులు అర్పించారు. దేశభక్తుల స్ఫూర్తితో మోదీ ముందుకు సాగుతున్నారన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడిన వ్యక్తి మోదీ అని తెలిపారు. యువతకు దేశభక్తి స్ఫూర్తిని నింపుతున్న వ్యక్తి మోదీ అని అన్నారు. ప్రజలు మోదీకి అండగా ఉండాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
Updated Date - 2021-08-15T16:09:25+05:30 IST