ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ముఖ్యమంత్రి కేసీఆర్‌వి మోసపూరిత హామీలు’

ABN, First Publish Date - 2021-07-27T06:48:11+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీలను మోసగిస్తున్నారని, వారికి ఇచ్చిన మామీలు నెరవేర్చాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖైరతాబాద్‌ జూలై 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీలను మోసగిస్తున్నారని, వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. సోమవారం ఖైదరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌ జుబేదా బేగంకు వినతిపత్రం అందజేశారు. చింతల మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందన్నారు. కేసీఆర్‌ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులందరికీ మూడెకరాలు ఇస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకముందే దళితబంధు ప్రటించి హుజూరాబాద్‌ ఎన్నికల్లో లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆదర్శ్‌వంశీకర్‌, రామ్మోహన్‌రావు, ఎన్‌డీ నగేష్‌, క్రాంతి, లాల్‌హీరా, వీణామాధురి, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T06:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising