ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చిందా?: బండి సంజయ్

ABN, First Publish Date - 2021-11-21T21:14:13+05:30

సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చిందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చిందా? అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా..? పంజాబ్ రైతుల కోసమా? అన్నది అర్థంకాలేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్‌ తీసేయాలన్న ముఖ్యమంత్రి అక్కడే ధర్నా చేశారని విమర్శించారు. మిల్లర్లతో కలిసి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని, రైతుల కోసం ఆలోచించే పార్టీ బీజేపీ అని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి రైతులకు రూ.3లక్షలు ఇస్తారట... మరి తెలంగాణలో చనిపోయిన రైతులకు ఇవ్వరా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ మూర్కత్వంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు.

Updated Date - 2021-11-21T21:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising