ఏటీఎంలో నగదు విత్డ్రా చేస్తే...!
ABN, First Publish Date - 2021-07-04T14:28:37+05:30
ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఒక ఏటీఎం నుంచి కస్టమర్లు....
- బ్యాంకు చెస్ట్ ఖాతా నుంచిడెబిట్
- సైబర్క్రైమ్స్లో ఎస్బీఐ అధికారుల ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఒక ఏటీఎం నుంచి కస్టమర్లు తమ డెబిట్ కార్డుల ద్వారా విత్డ్రా చేసే నగదు వారి ఖాతాల నుంచికాకుండా బ్యాంకు చెస్ట్ ఖాతా నుంచి డెబిట్ కావడంతో అధికారులు సిటీ సైబర్క్రైమ్స్లో శనివారం ఫిర్యాదు చేశారని ఏసీపీ కేవీఎం.ప్రసాద్ తెలిపారు. బ్యాంకు సాఫ్ట్వేర్ చెక్ చేయించినప్పటికీ ఎలాంటి లోపాలూ లేకపోవడంతో కేటుగాళ్లు సాఫ్ట్వేర్ను హ్యాక్ చేసి బ్యాంకు చెస్ట్ ఖాతా నుంచి డబ్బులను ఏదైనా ఖాతాల్లోకి మళ్లిస్తున్నారా? అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Updated Date - 2021-07-04T14:28:37+05:30 IST