జగన్ బెయిల్ రద్దు కేసు...నేడు సీబీఐ కోర్టులో విచారణ
ABN, First Publish Date - 2021-07-14T13:27:16+05:30
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి బెయిల్ రద్దు కేసులో ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి బెయిల్ రద్దు కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది. లిఖితపూర్వక వాదనలను పిటిషనర్, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. కాగా లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి సీబీఐ నిరాకరించింది. జగన్, రఘురామ తరుపు న్యాయవాదులు సమర్పించిన లిఖిత పూర్వక వాదనలపై న్యాయస్థానం విచారణ చేయనుంది.
Updated Date - 2021-07-14T13:27:16+05:30 IST