ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌లో ఇక త్వరలో జంతు దహన వాటికలు..

ABN, First Publish Date - 2021-12-08T17:05:17+05:30

త్వరలో జంతువుల దహన వాటికలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఒక్కో దహనానికి రూ.2,500
  • రెండు ప్రాంతాల్లో ఏర్పాటు

హైదరాబాద్‌ సిటీ : త్వరలో జంతువుల దహన వాటికలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి సంస్థల ఎంపికను జీహెచ్‌ఎంసీ పూర్తి చేసింది. ఎల్‌బీనగర్‌ జోన్‌లోని ఫతుల్లగూడ, కూకట్‌పల్లి జోన్‌లోని మహదేవపుర యానిమల్‌ కేర్‌ సెంటర్లలో జంతు దహన వాటికలను ఏర్పాటు చేయనున్నారు. పీపుల్‌ ఫర్‌ యానిమల్స్‌, రాగ ఫౌండేషన్‌లకు ఈ బాధ్యతలను అప్పగించారు. యంత్రాలు, విద్యుత్‌ సరఫరా, సిబ్బందిని సమకూర్చుకోవడంతో పాటు, నిర్వహణ కూడా ఆయా సంస్థలదే. ఒక్కో జంతువు దహనానికి రూ.2500 వసూలు చేస్తారని ఓ అధికారి చెప్పారు. 

పెంపుడు కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులను ఇక్కడ దహనం చేయనున్నారు. వీధి కుక్కలు, రోడ్లపై చనిపోయే ఇతర జంతువుల దహనానికి జీహెచ్‌ఎంసీయే ఖర్చులు భరించే అవకాశముంది. దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను స్టాండింగ్‌ కమిటీ ఆమోదం కోసం ఎజెండాలో పెట్టారు. చనిపోయిన జంతువులను రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీంతో దుర్వాసన రావడంతోపాటు ప్రజారోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకే దహన వాటికల ఏర్పాటు నిర్ణయమని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

Updated Date - 2021-12-08T17:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising