ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయీ బ్రాహ్మణుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం: దాసోజు

ABN, First Publish Date - 2021-09-11T23:39:24+05:30

నాయీ బ్రాహ్మణుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం: దాసోజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నాయీ బ్రాహ్మణుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ అన్నారు. గాంధీభవన్‌లో నాయీ బ్రాహ్మణ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ ‘‘నాయీ బ్రాహ్మణులకు జుట్టు కత్తిరించడమే కాదు అవసరమైతే టీఆర్ఎస్ తోకలు కత్తిరించడమూ తెలుసు. గెడ్డం గీయడమే కాదు.. మోసం చేసిన కేసీఆర్ సర్కార్‌కి గుండుకొట్టి గద్దె దించడమూ తెలుసు. ఎన్నికల ముందు కేసీఆర్ ఓట్ల కోసం నాయీ బ్రాహ్మణులకు చాలా వాగ్దానాలు ఇచ్చారు. తీరా గెలిచాక నిలువునా మోసం చేశారు. 30వేల మోడ్రన్ సెలూన్లు,  250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,  నాయీ బ్రహ్మణులకు ఒక ఎమ్మెల్సీ పదవి , బడ్జెట్‌లో రూ. 250 కోట్లు వెంటనే కేటాయించాలి.’’ అని డిమాండ్ చేశారు.


52 శాతం ఉన్న బీసీలు తెలంగాణ రాష్ట్ర సాధనలో పెద్ద ఎత్తున బాగామయ్యారని దాసోజు శ్రావణ్ గుర్తు చేశారు. చాలా మంది ఆత్మ బలిదానాలు చేశారని చెప్పారు. కానీ నేడు త్యాగాలు ఒకరివి. బోగాలు మరొకరికి అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీలు అంటే కేసీఆర్‌కి ఎందుకు అంత చిన్న చూపన్నారు. బీసీలు ఏం పాపం చేశారని దాసోజు శ్రావణ్ ప్రశ్నించారు.

Updated Date - 2021-09-11T23:39:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising