రాజేంద్రనగర్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం కేసు..
ABN, First Publish Date - 2021-10-21T17:24:27+05:30
రాజేంద్రనగర్లో అభం శుభం తెలియని నాలుగు ఏళ్ల చిన్నారిపై శ్రీకాంత్ అనే మానవ మృగం అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్: రాజేంద్రనగర్లో అభం శుభం తెలియని నాలుగు ఏళ్ల చిన్నారిపై శ్రీకాంత్ అనే మానవ మృగం అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాలుగు రోజుల క్రితం చిన్నారిపై అత్యాచారం జరిగింది. నిందితుడు మెస్త్రీ పనికి వెళ్తూ వచ్చిన డబ్బులతో జులాయిగా తిరుగుతుంటాడు. గంజాయిని కూడా తీసుకుంటాడని అక్కడి స్థానికులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు గంజా మత్తులో చిన్నారిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Updated Date - 2021-10-21T17:24:27+05:30 IST