HYD: నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్
ABN, First Publish Date - 2021-09-08T17:52:08+05:30
ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్ను పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. కిషన్బాగ్కు
ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ పోలీసులకు అప్పగింత
హైదరాబాద్/మదీన: ఆటోలో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్ను పోలీసులకు అప్పగించి తన నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. కిషన్బాగ్కు చెందిన షేక్చాంద్ ఆటో డ్రైవర్. మంగళవారం మధ్యాహ్నం మహ్మద్దానిష్ అనే ప్రయాణికుడిని మెహదీపట్నంలో ఎక్కించుకుని కామాటిపురాలో దించాడు. ప్రయాణికుడు దిగి వెళ్లిపోయిన తర్వాత ఆటోలో బ్యాగ్ ఉండడం గమనించిన షేక్చాంద్ దాన్ని కామాటిపురా ఇన్స్పెక్టర్కు అందజేశారు. బాధితుడు స్టేషన్కు వెళ్లాడు. బ్యాగ్ అతడిదే అని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు దాన్ని ప్రయాణికుడికి అందజేశారు. బ్యాగ్లో రూ. 2లక్షల విలువ చేసే మూడున్నర తులాల బంగారం, సెల్ఫోన్, రూ. 2,500, విలువైన వస్తువులు,డాక్యుమెంట్లు ఉన్నాయి.
Updated Date - 2021-09-08T17:52:08+05:30 IST