లెమన్ ట్రీ హోటల్లో ప్రేమజంట ఆత్మహత్య కేసు అప్డేట్..
ABN, First Publish Date - 2021-07-30T18:17:31+05:30
బుధవారం మాదాపూర్లోని లెమన్ట్రీ హోటల్లో గురువారం ప్రేమజంట రాములు(25), లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి(25), ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్
హైదరాబాద్: బుధవారం మాదాపూర్లోని లెమన్ట్రీ హోటల్లో గురువారం ప్రేమజంట రాములు(25), లగచర్ల గ్రామానికి చెందిన సంతోషి(25), ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. లెమన్ ట్రీ హోటల్ జరిగిన సూసైడ్, మర్డర్ కేసు దర్యాప్తు కేసును దర్యాప్తు జరుగుతున్నట్లు సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. సంతోషి (25), రాములు (25) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి విషయంలో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించకపోవడంతో..యువతి సంతోషి దిల్సుఖ్నగర్ లో కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటానని చెప్పి హాస్టల్ లో ఉంటుందని తెలిపారు.
కానీ చాలా కాలంపాటు రాములుతో కలిసి సంతోషి రూమ్లో కలిసి ఉందని తెలిపారు. అయితే.. అమ్మాయిని కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని ఒత్తడి పెంచారు. దీంతో ప్రియురాలు ప్రియుడికి నాకు ఇంట్లో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారని ప్రియుడికి చెప్పింది. ఈ తరుణంలో తనకు తన ప్రియురాలు దూరమవుతుందోనని రాములు ఈ ఘాతుకాని పాల్పడినట్లు తెలిపాడు. ఫస్ట్ ప్రియురాలిని బ్లెడ్తో గొంతుకోసి..తర్వాత రాములు ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీస్ను కుటుంబ సభ్యులకు అందజేస్తామని తెలిపారు.
ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది..: సోదరుడు
నెల రోజుల క్రితం మా సోదరి సంతోష ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పిందని యువతి సోదరుడు తెలిపాడు. రామును పెళ్లి చేసుకుంటానని చెప్పిందని, మేము పెళ్లికి ఒప్పుకున్నామని తెలిపాడు. కులం వేరే అయినా పెళ్లికి ఒప్పుకున్నామని, కానీ రాములు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని చెప్పాడు. కులాంతర వివాహానికి రాములు కుటుంబం అంగీకరించలేదన్నాడు. ఈ విషయం మాకు సోదరి చెప్పలేదన్నాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారని అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - 2021-07-30T18:17:31+05:30 IST