ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: గణేష్ ఉత్సవాలు..నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

ABN, First Publish Date - 2021-09-09T16:46:05+05:30

గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆంక్షలు విధించింది. హైకోర్టు జారీ చేసిన ఆంక్షలు ప్రభుత్వం అమలు చేయాలని సూచించింది. హుస్సేన్‎సాగర్‎లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‎సాగర్‎లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. హుస్సేన్ సాగర్‎లో ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని ప్రభుత్వానికి సూచించింది. హుస్సేన్ సాగర్‎లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని, లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రబ్బరు డ్యాంలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని హైకోర్టు సూచించింది_


చివరగా.. తమ ఆదేశాలను తూ.చ తప్పకుండా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసులు అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారించింది. పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసి తాజాగా తీర్పును వెల్లడించింది.

Updated Date - 2021-09-09T16:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising