Hyderabadలో మళ్లీ డ్రగ్స్ కలకలం
ABN, First Publish Date - 2021-12-16T17:53:35+05:30
భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఔటర్ రింగ్రోడ్డులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఔటర్ రింగ్రోడ్డులో డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ పోలీసుల అదుపులో సాఫ్ట్వేర్ ఉద్యోగి రమ్య, సిద్ధిక్, అఖిల్ ఉన్నారు. గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకువచ్చినట్టు గుర్తించారు. 2 గ్రాముల గంజాయితో పాటు మేధాం ఫెటిక్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడేందుకు తెచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొబైల్ అప్లికేషన్ ద్వారా ముగ్గురికి పరిచయం అయినట్లు తెలుస్తోంది. తరచూ గోవాకి వెళ్లే అఖిల్కు డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-12-16T17:53:35+05:30 IST