Hyd: పాతబస్తీ, చాంద్రాయణగుట్టలో దారి దోపిడీ దొంగల హల్చల్
ABN, First Publish Date - 2021-08-10T17:21:05+05:30
నగరంలోని పాతబస్తీ, చాంద్రాయణగుట్ట పరిధిలో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్ పై వెళ్తున్న వారిని ఆపి వారిపై దాడి దిగారు. షాహీనగర్ నుండి 3 వాహనాలపై
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ, చాంద్రాయణగుట్ట పరిధిలో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్ పై వెళ్తున్న వారిని ఆపి వారిపై దాడి దిగారు. షాహీనగర్ నుండి 3 వాహనాలపై రెండు బైక్లను వెంబడించారు. ఎర్రకుంట వద్ద వాహనాన్ని ఆపి నిందితులు దాడి చేశారు. రెండు మొబైల్ ఫోన్లు, రూ.30వేల నగదు, పల్సర్ వాహనం లాక్కుని పారిపోయారు. బాధితులు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-08-10T17:21:05+05:30 IST