టీకా ఉత్సవ్ పేరుతో హంగామా: నారాయణ
ABN, First Publish Date - 2021-04-11T08:47:21+05:30
కరోనా మహమ్మారి నియంత్రణ పేరుతో ఉత్తుత్తి హంగామాలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరితేరిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి నియంత్రణ పేరుతో ఉత్తుత్తి హంగామాలు చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆరితేరిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజలకు అవసరమైన కొవిడ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేయకుండానే ‘‘టీకా ఉత్సవ్’’ పేరుతో హంగామా చేస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధికంగా వాక్సిన్ డోసులు పంపుతూ ఇతర రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఓ ప్రకటనలో ఆయన ఆరోపించారు. అందువల్లే రాజస్థాన్, ఒడిశా, తెలంగాణకు అవసరమైన టీకాలు అందలేదని అన్నారు. కరోనా కట్టడిలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు.
Updated Date - 2021-04-11T08:47:21+05:30 IST