ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.21 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ABN, First Publish Date - 2021-03-08T08:52:36+05:30

ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, పూజలు చేస్తే అవి దక్కుతాయని నమ్మించి ఓ మహిళను నిండా ముంచారు కేటుగాళ్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుప్త నిధులున్నాయని మహిళకు టోపీ

కడెం, మార్చి 7: ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని,  పూజలు చేస్తే అవి దక్కుతాయని నమ్మించి ఓ మహిళను నిండా ముంచారు కేటుగాళ్లు. నిర్మల్‌ జిల్లా కడెం మండలం పెద్దూర్‌లో ఈ ఘటన జరిగింది. ఆరు నెలల క్రితం జన్నారం, మంచిర్యాల్‌, మేడారానికి చెందిన ముగ్గురు కోయ పూజారులు పెద్దూర్‌ గ్రామానికి వచ్చి ఆ మహిళ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు ఇంట్లో తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. తవ్వకాల్లో దేవుని ప్రతిమ, ఇత్తడి బిందె, కొంత బంగారం లభించాయని, వాటినివారం రోజుల పాటు ఊరి బయట పూజలు నిర్వహించి విప్పితే ఇంకా పెద్ద మొత్తంలో గుప్తనిధులు దక్కుతాయని కేటుగాళ్లు ఆమెను నమ్మించారు. ఇందు కోసం ఆ వ్యక్తులు ఆ మహిళ వద్ద వివిధ వాయిదాల్లో రూ.21 లక్షలు తీసుకెళ్లారు. బాధితురాలు చివరకు వారు చెప్పినట్లు చేసినా నిధులు దక్కలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని కడెం ఎస్‌ఐ రాజు తెలిపారు.

Updated Date - 2021-03-08T08:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising