సిరివెన్నెల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: హరీష్రావు
ABN, First Publish Date - 2021-12-01T16:38:26+05:30
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమ, సాహిత్య కవులకు తీరని లోటు అని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.
హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమ, సాహిత్య కవులకు తీరని లోటు అని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. పండితులు, పామరులను ఆయన రచనలు మెప్పించాయన్నారు. సమాజంలో గొప్ప చైతన్యం కలిగించడానికి పాటలు రాశారని కొనియాడారు. సమాజంలో అసమానతలు తొలగించి చైతన్యం నింపేలా పాటలు ఉంటాయని సిరివెన్నెల పేర్కొన్నారు.
Updated Date - 2021-12-01T16:38:26+05:30 IST