హనుమకొండలో కోర్టు భవనాల సముదాయం ప్రారంభం
ABN, First Publish Date - 2021-12-19T16:34:55+05:30
జిల్లాలో కోర్టు భవనాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ఉదయం ప్రారంభించారు.
హనుమకొండ: జిల్లాలో కోర్టు భవనాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఆపై కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హనుమడు, కొండడు శిలను సీజేఐ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. కోర్టు భవన సముదాయంతో పాటు ఫ్యామిలీ కోర్టు, ఫోక్సో కోర్టు భవనాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు పాల్గొన్నారు.
అంతకు ముందుకు కార్యక్రమానికి వచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ బుయాన్, రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావ్, వరంగల్ జిల్లా జడ్జి ప్రిన్సిపల్ జడ్జి నందికొండ నర్సింగరావు, న్యాయవాదులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.
Updated Date - 2021-12-19T16:34:55+05:30 IST