పరకాలలో దొంగల బీభత్సం
ABN, First Publish Date - 2021-09-16T14:42:39+05:30
పరకాల పట్టణంలో దొంగల బీభత్సం సృష్టించారు.
హనుమకొండ: పరకాల పట్టణంలో దొంగల బీభత్సం సృష్టించారు. పరకాల పట్టణంలోని డీసీసీ బ్యాంకుకు అర్ధరాత్రి కన్నం వేసి దోచుకునేందుకు దొంగల విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుకనుండి కన్నం వేసి దోచుకునేందుకు గోడను తవ్వే ప్రయత్నం చేశారు. కాగా శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు లేచి అరవడంతో దుండగులు పారిపోయారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.
Updated Date - 2021-09-16T14:42:39+05:30 IST