ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పచ్చదనాన్ని పెంచాలి.. ప్రకృతి మాతను రక్షించాలి: సీజేఐ రమణ

ABN, First Publish Date - 2021-06-16T09:14:55+05:30

ప్రకృతి మాతను కాపాడుకునేందుకు పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటిన సీజేఐ

హైదరాబాద్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ప్రకృతి మాతను కాపాడుకునేందుకు పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. భవిష్యత్తు తరాల సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడేందుకు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన మేరకు పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని పెంచడం ఒక అలవాటుగా చేసుకోవాలని న్యాయ వ్యవస్థకు పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం రాజ్‌భవన్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఇండియా కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా మార్గదర్శకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌, సీనియర్‌ న్యాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణకు వృక్షవేదం పుస్తకాన్ని జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ బహూకరించారు. 

Updated Date - 2021-06-16T09:14:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising