భాగ్య లక్ష్మీ ఆలయాన్ని సందర్శించిన గవర్నర్
ABN, First Publish Date - 2021-11-04T22:51:49+05:30
ప్రముఖ దేవాలయం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గవర్నర్ తమిళిసై దంపతులు గురువారం దర్శించుకున్నారు.
హైదరాబాద్: ప్రముఖ దేవాలయం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గవర్నర్ తమిళిసై దంపతులు గురువారం దర్శించుకున్నారు. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గవర్నర్ తమిళిసై, ఆమె భర్త సౌందర రాజన్తో కలిసి ఆలయానికి విచ్చేశారు. వారికి ఆలయ ట్రస్టీ శశికళ తదితరులు స్వాగతం పలికారు. ఈసందర్భంగా గవర్నర్ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. దీపావళి పర్వదినం సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు ఎల్. రమణ , తీగల కృష్ణారెడ్డి, శాసన మండలి ఛైర్మన్ భూపాల్రెడ్డి, సినీనటుడు బాబూమోయన్, జర్నలిస్టునాయకుడు వరకాల యాదగిరి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
Updated Date - 2021-11-04T22:51:49+05:30 IST