పీవీకి నివాళుర్పించిన గవర్నర్
ABN, First Publish Date - 2021-12-24T02:17:29+05:30
మాజీ దివంగత ప్రధాని పీవీ నరసింహారావుగురు 17 వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్ లోని పీవీ జ్ఞాన భూమి లో గల పీవీ ఘాట్ పై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.
హైదరాబాద్: మాజీ దివంగత ప్రధాని పీవీ నరసింహారావుగురు 17 వ వర్ధంతి సందర్భంగా పీవీ మార్గ్ లోని పీవీ జ్ఞాన భూమి లో గల పీవీ ఘాట్ పై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పివి బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. 9 జాతీయ,8 ఇతర దేశాల భాషలు మాట్లాడగల వ్యక్తి అని, జాతిపిత గా పీవీని పిలుస్తారని, యూత్ రోల్ మోడల్ పీవీ అని జాతి గర్వించదగ్గ వ్యక్తి అని అన్నారు. పివి చేసిన ఆర్థిక సంస్కరణల వలన దేశం అభివృద్ధి పధంలో వెళుతుందని పీవీని కొనియాడారు.
Updated Date - 2021-12-24T02:17:29+05:30 IST