సరిహద్దుల పరిరక్షణలో సాయుధ దళాల పాత్ర కీలకం
ABN, First Publish Date - 2021-12-06T22:03:17+05:30
దేశ సరిహద్దుల రక్షణలో సాయుధ దళాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.
హైదరాబాద్: దేశ సరిహద్దుల రక్షణలో సాయుధ దళాల పాత్ర ఎంతో కీలకమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. సోమవారం సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా గవర్నర్ తన సందేశాన్నిచ్చారు. దేశ రక్షణలో ఎందరో జవానులు, వీరనారీలు, వికలాంగులైన జవానులు, మాజీ సైనికులు వారి కుటుంబాలకు గవర్నర్ శుభా కాంక్షలు తెలిపారు. సరిహద్దులను కాపాడడంలోనే కాదు యుద్ధ సమయంలోనూ, శాంతి సమయాల్లోనూ వారు దేశానికి ఎంతో సేవలు అందిస్తున్నారని అన్నారు.
సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా వారు దేశం కోసం చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం వుందన్నారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సాయుధ దళాల ఫ్లాగ్ డేకు విరాళాలు ఇవ్వాలని గవర్నర్ కోరారు. ఈ విధంగా వచ్చే నిధులతో వికలాంగులైన సైనికులకు, వీర నారీమణులకు, మాజీ సైనికులు, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఉపయోగ పడుతుందన్నారు.
Updated Date - 2021-12-06T22:03:17+05:30 IST