ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోనమెత్తిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

ABN, First Publish Date - 2021-08-09T01:41:56+05:30

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను ఈరోజు రాజ్ భవన్ ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో ఘనంగా జరిగాయి.గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను ఈరోజు రాజ్ భవన్ ప్రాంగణంలోని అమ్మవారి గుడిలో ఘనంగా  జరిగాయి.గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనం ఎత్తుకొని, గవర్నర్ నివాసం నుండి అమ్మవారి గుడి వరకు నడుచుకుంటూ వచ్చి బోనం సమర్పించారు.గవర్నర్ కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ సిబ్బంది, రాజ్ భవన్ పరివార్ కు చెందిన మహిళలు గవర్నర్ తో పాటు బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం  సమర్పించారు.


భారతదేశం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మరింతగా అభివృద్ధి చెందాలని  అమ్మవారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా డాక్టర్ తమిళిసై తెలిపారు.హైదరాబాద్ సంప్రదాయ పద్ధతిలో  బోనాలను  ఎత్తుకుని,  జాతర తరహా మేళతాళాలతో గవర్నర్ తన నివాసం నుండి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ స్వయంగా బోనం ఎత్తుకొని రావడం,  సిబ్బంది ఊరేగింపు గా రావడం తో రాజ్ భవన్ లో బోనాల పండుగ సంబరాలతో కళకళలాడింది. 

Updated Date - 2021-08-09T01:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising