గవర్నర్ తమిళిసైతో ఎంపీ సోయం బాపురావు భేటీ
ABN, First Publish Date - 2021-12-29T19:20:28+05:30
గవర్నర్ తమిళిసైతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బుధవారం రాజ్భవన్లో భేటీ అయ్యారు.
హైదరాబాద్: గవర్నర్ తమిళిసైతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బుధవారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ పరిధిలో ఉన్న ఐదవ షెడ్యూల్ను కాపాడాలని గవర్నర్ను కోరామన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317వ జీవోతో ఆదివాసీ, గిరిజన ఉద్యోగుకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. షెడ్యూల్ ఐదును కాలరాయటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గవర్నర్ పరిధిలో ఉన్న ఐదవ షెడ్యూల్ను కాపాడే బాధ్యత రాజ్ భవన్దే అని అన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గిరిజన, ఆదివాసీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 317జీవోతో ఆదివాసీ గిరిజనులకు కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదన్నారు. పోడు రైతులకు పట్టాలు ఇస్తామన్న హమీ అమలు అయ్యేలా చూడాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. జనవరి 9న భద్రాచలంలో జరగనున్న ఆదివాసీల మహిళా సమ్మేళనాన్ని గిరిజనులు విజయవంతం చేయాలని ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు.
Updated Date - 2021-12-29T19:20:28+05:30 IST