ఈటలకు ప్రభుత్వం రక్షణ ఇస్తుంది: హరీశ్రావు
ABN, First Publish Date - 2021-10-11T00:43:07+05:30
తనకు రక్షణ లేదని, దాడి చేస్తారేమోనని, గన్మన్లను తగ్గించారని తరచూ చెప్పుకుంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ప్రభుత్వం అన్ని రకాలుగా రక్షణ ఇస్తుందని
హుజూరాబాద్: తనకు రక్షణ లేదని, దాడి చేస్తారేమోనని, గన్మన్లను తగ్గించారని తరచూ చెప్పుకుంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ప్రభుత్వం అన్ని రకాలుగా రక్షణ ఇస్తుందని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆయన భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆదివారం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. రాజేందర్ ఎక్కడ ఉపన్యాసానికి వచ్చినా తాను ఈ పని చేసిన, గెలిస్తే ఇది చేస్తా అని చెప్పకుండా ఇతరుల మీద బురద జల్లుతున్నారని ఆరోపించారు. గతంలో బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కు తెచ్చి ప్రజల అకౌంట్లలో వేస్తామని చెప్పారని, ఎవరి అకౌంట్లలో ఆ డబ్బులు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ను ప్రజలు ఆరుసార్లు గెలిపించి 17ఏళ్లు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈటల రాజేందర్ బీజేపీ నాలుగు నెలల క్రితం చెడ్డ పార్టీ అన్నారని, ఇప్పుడు ఆయన చేరగానే మంచి పార్టీ ఎలా అయిందో చెప్పాలని హరీశ్రావు ప్రశ్నించారు.
Updated Date - 2021-10-11T00:43:07+05:30 IST