కోవిడ్ లెక్కలను తప్పుగా చూపెడుతున్న ప్రభుత్వం: దాసోజు శ్రావణ్
ABN, First Publish Date - 2021-07-01T21:11:48+05:30
కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు 4లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ అన్నారు.
హైదరాబాద్: కోవిడ్తో మరణించిన వారి కుటుంబాలకు 4లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ముళ్లుగర్రతో పొడిచిందన్నారు. కోవిడ్తో కేవలం 3651మంది మాత్రమే చనిపోయినట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోందన్నారు. తాము తీసిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు లక్ష యాభై వేల మంది కోవిడ్తో మరణించారని చెప్పారు. ప్రభుత్వ చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరణాల సంఖ్యను తక్కువగా చూపుతున్నారురన్నారు. జాతీయ విపత్తుల విభాగం ఎక్స్ గ్రేషియా ఇస్తే మన రాష్ట్రంలో 3700 కుటుంబాలకు మాత్రమే న్యాయం జరుగుతుందన్నారు. మృతులందరి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందాలంటే ప్రభుత్వం అసలైన లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరణాలు దాచి ప్రభుత్వం బాధితుల నోట్లో మట్టి కొడుతోందని మండిపడ్డారు. దొంగలెక్కలు చెప్పిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-07-01T21:11:48+05:30 IST