ఈతకు వెళ్ళి యువకుడి మృతి
ABN, First Publish Date - 2021-10-08T02:11:09+05:30
పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంబర్పేటకు చెందిన 17 సంవత్సరాల యువకుడు ఓయులోని మోహిన్...
హైదరాబాద్: పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంబర్పేటకు చెందిన 17 సంవత్సరాల యువకుడు ఓయులోని మోహిన్ చెరువులో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కిరణ్ నీట మునిగి మృతి చెందాడు. మిగతా ముగ్గురు స్నేహితులు బయటపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Updated Date - 2021-10-08T02:11:09+05:30 IST