ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు
ABN, First Publish Date - 2021-11-11T22:51:02+05:30
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ల గడువు ముగిసింది. 15 స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి 11, ఎంఐఎం నుంచి 7 నామినేషన్లు దాఖలయ్యాయి. 15 స్థానాలను ఏకగ్రీవం చేసుకునే దిశగా టీఆర్ఎస్-ఎంఐఎం ప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య 9-6 చొప్పున ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. శుక్రవారం స్క్రూటినీ అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. టీఆర్ఎస్, ఎంఐఎం ఒప్పందం ప్రకారం 15 స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. 15 మందికి మించి అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నిక అనివార్యం అవుతుంది. ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి.
Updated Date - 2021-11-11T22:51:02+05:30 IST